డీజీపీ నిర్ణయం.. నిమ్మగడ్డ ఆమోదం

Published: Wednesday January 27, 2021

పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా చేపట్టే బాధ్యతలను పోలీసు ట్రైనింగ్‌ ఐజీ ఎన్‌.సంజయ్‌కు అప్పగించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆయన్ను నియమించగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో సంజయ్‌ మంగళవారం కమిషనర్‌తో సమావేశమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై చర్చించారు. నిరుడు మార్చిలో పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని భద్రత, బందోబస్తు ఎలా ఉండాలి.. సమస్యాత్మక గ్రామాల్లో బలగాల మోహరింపు, సమస్యలు సృష్టించే వ్యక్తుల బైండోవర్‌, డ్రోన్లతో పర్యవేక్షణ, నిఘా యాప్‌ గురించి ప్రజల్లో చైతన్యం, హద్దులు దాటిన వారిపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ‘నిఘా’ యాప్‌ను తయారు చేసి ఎవరు అక్రమాలకు పాల్పడినా ప్రజలే వీడియోలు, ఫొటోలు తీసి అందులో పెట్టేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని మీడియాతో పాటు అన్ని మార్గాల్లోనూ జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కమిషనర్‌ సూచించినట్లు సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో జరిగిన హింస, పల్నాడులో à°—à°¤ ఏడాది ఎన్నికల సందర్భంగా దాడులు, ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరిగిన దృష్ట్యా పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని ఐజీని ఆదేశించినట్లు సమాచారం.

 

పరిషత్‌, పురపాలక ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు కొందరు అధికార పార్టీ తరపున ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడం, మరికొన్ని చోట్ల ఏకగ్రీవాలకు పరోక్షంగా సహకరించడం, అధికార పార్టీ అక్రమాలను పట్టించుకోకపోవడంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో అటువంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర పోలీసులపై నిఘా పెట్టడం, అవసరం మేరకు కేంద్ర బలగాలను రప్పించడంపైనా ఆలోచన చేయాలని కమిషనర్‌ సూచించారని సమాచారం.

 

 à°…న్నీ నమోదు చేసుకున్న సంజయ్‌.. à°† తర్వాత డీజీపీ, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, నిఘా విభాగం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కాగా.. 13 జిల్లాల ఎస్పీలతో డీజీపీ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒక్క పంచాయతీలోనూ చిన్న ఘటన కూడా జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఐజీ సంజయ్‌తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం పంచాయతీల్లో సమస్యాత్మకమైన వాటి జాబితా సిద్ధంగా ఉన్నందున బైండోవర్లు, బందోబస్తు, అదనపు బలగాల మోహరింపుపై ఎస్పీల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని పలు సూచనలు చేసినట్లు సమాచారం. à°ˆ విషయమై ఐజీ సంజయ్‌ను సంప్రదించగా.. ప్రశాంత పోలింగ్‌ నిర్వహణపై చర్చించినట్లు చెప్పారు.

 

డీజీపీ తీసుకోబోయే చర్యలను ఎన్నికల కమిషనర్‌కు వివరించానని, ఆయన చేసిన సూచనలను డీజీపీకి తెలియజేసి అందుకు అనుగుణంగా బందోబస్తుపై ఎస్పీలకు ఆదేశించేలా విన్నవించినట్లు తెలిపారు. పోలీసుల విధి నిర్వహణలో సమస్యలు, డీజీపీ ఆదేశాలు, పోలీసుశాఖ తీసుకునే చర్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకురావడం, ఆయన సూచనలను డీజీపీకి తెలియజేయడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తన విధిగా పేర్కొన్నారు. ఏకగ్రీవాలను అడ్డుకోవడం తమ బాధ్యత కాదని.. వాటి వెనుక ప్రలోభాలు, ఒత్తిళ్లు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

 

ఉత్తరాంధ్రలో జన్మించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌ అనంతపురంలో ఎక్కువ కాలం పనిచేశారు. గుంటూరు ఐజీగా పనిచేశారు. ఇప్పుడు ట్రైనింగ్‌ విభాగం ఐజీగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైనా ఆయనకు అవగాహన ఉంది. టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. à°ˆ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో హింస, బెదిరింపులు, ఇతరత్రా ఉల్లంఘనలు పర్యవేక్షించే బాధ్యతలు ఆయనకు అప్పగించారు.