నిమ్మగడ్డ సీరియస్

Published: Saturday January 30, 2021

జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ను తొలగించకపోవడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌ ఆదిత్యానాథ్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేశానని ఆయన అంగీకరించిన తర్వాత కూడా.. చర్యలు తీసుకోకపోవడం పట్ల ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్గించే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ అవుతుందని లేఖలో నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు.