ఉత్తరాఖండ్‌లో కరిగిన భారీ మంచుకొండ

Published: Sunday February 07, 2021

 à°‰à°¤à±à°¤à°°à°¾à°–ండ్‌లో భారీ మంచుకొండ విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. మంచు à°–à°‚à°¡à°‚ కరగడంతో ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. చమోలీ జిల్లాలోని జోషి మఠ్‌లో ధౌలి à°—à°‚à°— నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్‌లోని రుషి à°—à°‚à°— పవర్ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా à°ˆ ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. వరదల ప్రభావం ఉత్తర ప్రదేశ్‌పై కూడా పడింది. ఉత్తర ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

 

ఉత్తరాఖండ్‌లోని నందాదేవి మంచు à°–à°‚à°¡à°‚ విరిగి, కరిగినట్లు సమాచారం అందిందని ఉత్తర ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. à°—à°‚à°—à°¾ నది పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నీటి స్థాయిని నిరంతరం గమనించాలని తెలిపారు. అవసరమైతే ప్రజలను వేరొక చోటుకు తరలించాలని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, పీఏసీ ఫ్లడ్ కంపెనీలను హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అధికారులు వరద సహాయ కార్యక్రమాలను స్థానికంగా సమన్వయపరచాలని పేర్కొన్నారు. 

 

ధౌలి గంగలో భారీ వరదల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ à°“ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రెండు ఐటీబీపీ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నట్లు తెలిపారు. డెహ్రాడూన్ నుంచి భారత వాయు సేన హెలికాప్టర్‌లో మరొక మూడు బృందాలు చేరుకుంటాయన్నారు. ఎస్‌డీఆర్ఎఫ్, స్థానిక పరిపాలనా యంత్రాంగం ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు. వరదల్లో జోషీమఠ్-మలరి వంతెన కొట్టుకుపోయింది. భారత సైన్యం సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేందుకు à°ˆ వంతెన ఉపయోగిస్తున్నారు. à°ˆ పరిస్థితిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఐటీబీపీ సమన్వయంతో వ్యవహరిస్తోంది. గౌషర్‌లోని ఐటీబీపీ రీజనల్ రెస్పాన్స్ సెంటర్ నుంచి పెద్ద సంఖ్యలో సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరింది. 

 

వంతెనల నిర్మాణంలో నిపుణులైన ఐటీబీపీ సిబ్బంది కూడా బయల్దేరారు. జోషీమఠ్ నుంచి 200 మంది సిబ్బందిని ఐటీబీపీ పంపించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయపడేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ à°“ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. డిజాస్టర్ ఆపరేషన్స్ సెంటర్ నంబర్ 1070 లేదా 9557444486కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు. పాత వీడియోలను చూపిస్తూ వందంతులు ప్రచారం చేయవద్దని ట్విటర్ వేదికగా కోరారు. భారీ వర్షాలు, అకస్మాత్తుగా వస్తున్న నీటి వల్ల చమోలీలోని రుషి à°—à°‚à°— గ్రామంలో à°°à°¿à°·à°¿ à°—à°‚à°— ప్రాజెక్టుకు నష్టం జరగవచ్చునని తెలిపారు. నదిలోకి నీరు అకస్మాత్తుగా అధికంగా వస్తున్నందువల్ల అలకనంద ప్రాంతంలో వరదలు సంభవించే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. 

 

ముందు జాగ్రత్త చర్యగా భాగీరథి నదీ ప్రవాహాన్ని నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అలకనంద ప్రవాహాన్ని నిరోధించేందుకు శ్రీనగర్, హృషికేశ్ డ్యామ్‌లను ఖాళీ చేసినట్లు తెలిపారు. ఎస్‌డీఆర్ఎఫ్‌ను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అధికారులు తెలిపే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపారు.