‘జగన్ పాలన వద్దనుకుంటున్నారు

Published: Tuesday February 09, 2021

రాజ్యాంగ హోదాలో ఉండే వ్యక్తుల పట్ల వైసీపి పెద్దలు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పకుండా చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నామని విజయసాయి రెడ్డి చెప్పడం అంగీకారం కాదని చెప్పారు. రాజ్యాంగం హోదాలో ఉన్న వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి లాంటి వారు ఆ పదవులకు అనర్హులని విమర్శించారు. రావాలి జగన్ .. కావాలి జగన్ అన్న ఏపి ప్రజలు , జగన్ పాలన తమకు వద్దని కోరుకుంటున్నారని చెప్పారు.