ఉన్నతవిద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Published: Friday February 12, 2021

ఉన్నతవిద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇంటర్‌, డిగ్రీల్లోనూ ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ ఇంగ్లీష్‌ మీడియంలోనే బోధించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా దశలవారీగా అమలు చేయాలని జగన్ ఆదేశించారు. ఇక నుంచి ఇంటర్‌, డిగ్రీ మొదటి ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు.