తాను తెలంగాణ కోడలినని..

Published: Tuesday February 16, 2021

తెలంగాణలో తాను ఏర్పాటు చేయనున్న పార్టీ నిర్మాణంపై ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల చర్చోపచర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. లోటస్ పాండ్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. కీలక నేతలతో ఆమె చర్చిస్తున్నారు. తనపై మిగతా పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లకు.. ఘాటుగా సమాధానం ఇచ్చేలా షర్మిల కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టాలంటే ఇక్కడి వాళ్లకే హక్కు ఉందంటూ అధికార పార్టీ నేతలు చేసిన కామెంట్లను ఆమె గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారట. తాను తెలంగాణ కోడలినని.. తనకు హక్కు ఉందని అనుచరుల దగ్గర షర్మిల వ్యాఖ్యానించారని సమాచారం. పుట్టినిల్లు ఆంధ్ర.. మెట్టినిల్లు తెలంగాణ అని షర్మిల ప్రచారం చేసే ఛాన్స్‌ ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.