మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఘోర ప్రమాదం

Published: Tuesday February 16, 2021

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న à°’à°• ప్రైవేటు బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకువెళ్లడంతో సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఏడుగురిని సహాయక సిబ్బంది కాపాడారు. తక్కిన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సిద్ధి నుంచి సాత్నా వెళ్తుండగా ఉదయం 8.30 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో à°ˆ ప్రమాదం జరిగిందని, బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐజీ ఉమోష్ జోగ తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సుతో పాటు à°—à°œ ఈతగాళ్లు, క్లేన్లను రంగంలోకి దింపారు. బాణసాగర్ కెనాల్‌లో నీటిని సిహ్వాల్ కెనాల్‌లోకి విడుదల చేయడం ద్వారా బస్సును క్రేన్లతో వెలికితీసే చర్యలు చేపట్టారు.

కాగా, ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సహాయక చర్యలకు ఆదేశాలిస్తున్నట్టు మధ్యప్రదేశ్ మంత్రి తులసి సిలావత్ తెలిపారు. తాను, మరో మంత్రి కలిసి ఘటనా స్థలికి వెళ్తున్నామని, ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 30కి పైగా మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు.