స్టీల్ ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం

Published: Wednesday February 17, 2021

ఎన్నికలు ముగిసిన తరువాత విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం ఉంటుందని అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సత్యవతి విమర్శించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సీఎం జగన్‌తో కార్మిక సంఘాల నేతలు మాట్లాడారని ఎంపీ పేర్కొన్నారు. ప్లాంట్ పరిరక్షణపై వారికి సీఎం భరోసా ఇచ్చారని ఆమె తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్టీల్ ప్లాంట్ పై అసెంబ్లీ తీర్మానం ఉంటుందని, à°ˆ విషయాన్నేకార్మిక సంఘాల నేతలకు సీఎం చెప్పారని సత్యవతి పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ కానుందని ఎంపీ సత్యవతి తెలిపారు.