పేకాట శిబిరంపై పోలీసుల దాడి

Published: Thursday February 18, 2021

జోరుగా సాగుతోన్న పేకాట శిబిరంపై పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని అగ్రహారంలో పేకాట ఆడతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 70 వేలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.