నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Published: Monday February 22, 2021

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్లు నష్టంతో 49,744 వద్ద .. నిఫ్టీ 306 పాయింట్ల కోల్పోయి 14,706 వద్ద ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ à°°à°‚à°— షేర్లు నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రేపటి రోజు ఎలా ఉంటుందోననే భయం వారిలో వ్యక్తమవుతోంది. అయితే.. à°—à°¤ కొంత కాలంగా స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ ప్రయత్నం జరిగి.. సూచిల్లో కొత్ పడిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. మహారాష్ట్రలోని రెండు నగరాల్లో లాక్‌డౌన్ ప్రకటన కూడా ప్రతికూల సెంటిమెంట్‌కు కారణమైందని వ్యాఖ్యానిస్తున్నారు. à°ˆ వారంలో గానీ.. వచ్చే వారం మొదట్లొ గానీ మార్కెట్ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే సానుకూల సంకేతాలే ఉన్నాయని చెబుతున్నారు. ఇది పెట్టుబడులకు అనూకూలమనే సూచనలు కూడా వెలువడుతున్నాయి.