ఎంపీలు పోరాటం చేస్తే మద్దతిస్తాం

Published: Saturday February 27, 2021

 à°¸à±à°Ÿà±€à°²à± ప్లాంట్ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరి మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హితవుపలికారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌పై  బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలన్నారు. విశాఖ ఉక్కు నిర్వాసితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పరిశ్రమలు ప్రేవేటికరణ చేస్తే ఉద్యోగులకు భద్రత ఉండదని తెలిపారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తే ప్రతిపక్షంగా తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఉక్కు కార్మికులు మార్చి ఐదున తలపెట్టిన బంద్‌లో విశాఖ వాసులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. à°ˆ బంద్‌కు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.