భూమిలోనుంచి వస్తున్న పాములు

Published: Thursday March 04, 2021

 à°’à°•à°Ÿà°¿ కాదు, రెండు కాదు.. ఏకంగా 20à°•à°¿ పైగా పాము పిల్లలు భూమిలోంచి బయటకు వచ్చాయి. అది కూడా నిత్యం ప్రజలు తిరిగే రోడ్డు పక్కన. జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, వెంకటాపురం గ్రామంలో జరిగిన à°ˆ ఘటన కలకలం సృష్టించింది. వెంకటాపురంలో రోడ్డుపక్కన మిషన్ భగీరథ కోసం గొయ్యి తీసి పూడ్చివేశారు. అందులోనే పాము గుడ్లను పెట్టింది. మొదట à°ˆ గొయ్యి నుంచి పాము పిల్ల బయటకు వచ్చింది. స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ఒకదాని వెనుక à°’à°•à°Ÿà°¿ ఇలా 20à°•à°¿ పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. అయితే à°ˆ పాము పిల్లలను చంపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిసరాల్లోకి వెళ్లిపోయాయి. à°† తర్వాత గొయ్యిని తవ్విన స్థానికులకు అందులో మరిన్ని పాము గుడ్లు కనిపించాయి. వాటిని ధ్వంసం చేసి గొయ్యిని పూడ్చివేశారు. అయితే తప్పించుకున్న పాములు ఇళ్లల్లోకి వచ్చి కాటేస్తాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.