బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు

Published: Thursday March 04, 2021

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మార్చి 5à°¨ జరిగే బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సమైక్య పోరాటం చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. భూముల్లో వాటా కొట్టేసేందుకే వైసీపీ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. నాడు ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. నేడు 36 కేసుల మాఫీ కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఉక్కు కర్మాగారాన్ని త్యాగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని à°“à°¡à°¿à°‚à°šà°¿ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.