ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ సంచలన ఆదేశాలు

Published: Wednesday March 10, 2021

పోలింగ్ బూత్‌లలోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లొచ్చని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చే ఓటర్ల వద్ద సెల్ ఫోన్స్ ఉన్నా.. ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయవద్దని ఆదేశించారు. కాగా ఓటర్లు ఎవరూ పోలింగ్ కేంద్రాలలో  సెల్‌ఫోన్ వినియోగించరాదని, అటువంటి ఘటనలు జరిగితే సీజ్ చెయ్యమని భద్రత సిబ్బందికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు. 

 

 

ఉదయం నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు తీసుకువెళ్తున్న ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్లు తీసుకురావద్దని ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. పోలీసులు అడ్డుకోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించకుండానే వెనుదిరుగుతున్న విషయం తెలిసిందే. à°ˆ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎస్‌ఈసీ రమేష్ కుమార్ à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.