నేటి పోరాటం.. రేపటి వెలుగుకు నాంది

Published: Saturday March 13, 2021

à°Ÿà°¿ విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలని యువ నటుడు నారా రోహిత్ పిలుపునిచ్చారు. నేటి ఉద్యమస్పూర్తి రేపటి ప్రగతికి బాట వేయాలన్నారు. ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ అన్నారు. ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి అని చెప్పారు. ఉక్కు పోరాటంలో తననూ భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనమన్నారు. తెలుగోడి అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం తన నైజం కాదని, సాటి ఆంధ్రుడికి కష్టమెచ్చినప్పుడు à°…à°‚à°¡à°—à°¾ నిలబడతానన్నారు. తెలుగుజాతి ఆత్మ గౌరవంపై దాడి జరుగుతోందని, యువతా.. మేలుకో అంటూ ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. యువత తన పోరాట పటిమతో నవయుగ చైతన్యానికి నాంది పలుకాలన్నారు. త్యాగధనుల పోరాటఫలం పరాధీనమవ్వకుండా పిడికిలి బిగించాలని, తెలుగువారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్య పోరాటానికి కదలిరా అంటూ పిలుపునిచ్చారు. త్వరలోనే విశాఖకు వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతానని అన్నారు.