ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు

Published: Tuesday March 16, 2021

 à°¤à±†à°²à±à°—ు రాష్ట్రాల్లో ఉపఎన్నికల నగరా మోగింది. తిరుపతి లోక్ సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. ఏప్రిల్ 17à°¨ తిరుపతితో పాటు నాగార్జునసాగర్‌లోనూ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 30à°¨ నామినేషన్లకు చివరి రోజు కాగా మే 2à°¨ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. à°ˆ మేరకు ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

 

కాగా ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఫలితాలు ముగిసిన వెంటనే మరోసారి ఎన్నికల నగరా మోగింది. మంగళవారం సాయంత్రం తిరుపతి ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. గతంలో తిరుపతి లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా à°ˆ స్థానంపై ఫోకస్ పెట్టాయి. అస్త్ర శస్త్రాలు సిద్ధం చేశాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ తిరుపతి లోక్ సభ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ కూడా తన అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది.  బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ వైసీపీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదు. సీఎం జగన్ వ్యక్తిగత డాక్టర్‌ గురుమూర్తిని తిరుపతి బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన పార్టీలు కూడా అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గెలుపు తమదేనంటూ ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి మున్సిపాలిటీని ఇప్పటికే వైసీపీ కైవసం చేసుకుంది. 

 

ఇక నాగార్జున‌సాగర్ అసెంబ్లీ స్థానానికి కూడా నగారా మోగింది. తెలంగాణలో రెండు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు à°ˆ నెల 17à°¨ విడుదల కానున్నాయి.  ఇంతలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.  à°ˆ స్థానంలో à°—à°¤ సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య గెలిచారు. అనంతరం ఆయన అకాల మరణం చెందడంతో à°ˆ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు కూడా ఎన్నికకు రెడీ అయ్యాయి. à°—à°¤ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి à°ˆ  స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో à°ˆ స్థానంలో మరోసారి జానా రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఆయన కుమారుడిని ఎన్నికల బరిలో దించేందుకు జానా రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అభ్యర్థిపై కసరత్తులు ప్రారంభించింది. ఇక టీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థిని పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి భార్యను పోటీ చేయించినట్లుగా నాగార్జున సాగర్ ఉపఎన్నికలో నోముల సతీమణిని పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. ఇక అక్కడి కార్యకర్తల అభీష్టం మేరకు తమ అభ్యర్థిని రంగంలోకి దించేందుకు రెడీ అయినట్లు సమాచారం. అటు టీటీడీపీ కూడా తమ అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు à°† పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగిలిన పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.