ఏప్రిల్1 నుంచి ఒంటిపూట బడులు

Published: Monday March 22, 2021

రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు జరుగుతాయని చెప్పారు. ఉదయం 7:45 నుంచి 11:30 వరకు తరగతులు ఉంటాయని.. తరువాత మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ ఆదేశించారు.