చిత్తూరులో ఏనుగుల బీభత్సం

Published: Monday March 22, 2021

ఎండాకాలం సమీపిస్తుండడంతో ఏనుగులు పంటల మీద పడి దాడి చేస్తున్నాయి. తాజాగా చిత్తూరు రూరల్ మండలంలోని అనుపల్లి పంచాయతీ పాపిరెడ్డిపల్లి గ్రామంలో వరి పంటలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖా అధికారులు ఏనుగులను తిరిగి అడవికి పంపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలో పంటలపై ఏనుగుల గుంపు దాడి చేయడం సర్వ సాధారణంగా మారింది.