రేపటి నుంచి విద్యాసంస్థల బంద్

Published: Tuesday March 23, 2021

 à°¤à±†à°²à°‚గాణలో రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేయనున్నారు. ఈమేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా విద్యా సంస్థల మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అన్ని విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుందన్నారు. అయితే ఆన్‌లైన్‌ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయన్నారు. మెడికల్‌ కాలేజీలు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్న ఆమె.. వారం రోజులుగా విద్యాసంస్థల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు.  అంతకుముందు సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితారెడ్డి భేటీ అయ్యారు. కరోనా వ్యాప్తి, విద్యాసంస్థలపై చర్చించారు. అనంతరం విద్యాసంస్థలను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చారు