ఇంద్రకీలాద్రిపై పని చేస్తున్న సిబ్బందికి కరోనా వ్యాక్సిన్

Published: Friday March 26, 2021

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి విజయవాడ డీఎంహెచ్‌వో కోవిడ్ టీకా వేశారు. దేవస్థానం ఈవో విజ్ఞప్తి మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై 45 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ టీకా వేసినట్టు డీఎంహెచ్‌వో వెల్లడించారు. దేవస్థానంలో వెయ్యి మంది సిబ్బంది పని చేస్తుండగా.. తొలిరోజు 400 మందికి టీకా వేశారు.  అర్చకులు, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి కోవిడ్ టీకా వేశారు. టీకా వేసుకున్న వారందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈవో సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.