‘టైం’ తేడా వస్తే అలిపిరిలోనే ఆపేస్తారు

Published: Tuesday March 30, 2021

 à°µà±€à°•à±†à°‚డ్‌ సెలవులు, లేదా పండగలు వచ్చాయని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే.. ఒక్క నిమిషం ఆగండి. కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో సాధారణ భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం టైం స్లాట్‌ టికెట్లు ఉన్నప్పటికీ.. భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కొండెక్కేద్దామంటే  కుదరదు. టైం స్లాట్‌లో పేర్కొన్న సమయానికి కొన్ని à°—à°‚à°Ÿà°² ముందు మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. వాస్తవానికి ప్రస్తుతం తిరుపతిలోని రైల్వే స్టేషన్‌ ముందున్న విష్ణునివాసంతో పాటు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 20 వేల టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. రద్దీ రోజుల్లో మరో 5 వేల టోకెన్ల కోటా పెంచుతున్నారు. à°ˆ టోకెన్లు పొందిన వారికి మరుసటిరోజు నుంచి దర్శనం కల్పిస్తున్నారు. అయితే.. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు కావొచ్చు లేదా స్థానికులు కొంతమంది కావొచ్చు మరుసటిరోజు వరకు ఆగకుండా టోకెన్‌ తీసుకున్న వెంటనే కొండెక్కేస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో à°ˆ రద్దీని నియంత్రించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిలో భాగంగా టైం స్లాట్‌ టోకెన్‌ పొంది కాలినడకన వచ్చే భక్తులను ఉదయం 9 గంటలకు, వాహనాల్లో వచ్చే వారిని మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ తర్వాత అనుమతించనున్నారు. à°ˆ మేరకు టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. à°ˆ నూతన విధానంపై నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం వంటివి ఆకస్మికంగా జరగడంతో సోమవారం పలువురు భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. టోకెన్‌ ఉన్నా తమను ఎందుకు కొండపైకి పంపడం లేదని విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొత్త నిబంధనలపై సిబ్బంది వివరించి భక్తులను శాంతింపజేశారు.

 

ప్రతినెల ఆఖరులోనూ ముందస్తు నెలకు సంబంధించి గదుల బుకింగ్‌ కోటాను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయడం ఇటీవల కాలంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే.. మార్చి నెల ఆఖరు వచ్చేసినా.. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన గదుల వివరాలను టీటీడీ అందుబాటులోకి తీసుకురాలేదు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా భక్తులకు కేటాయిస్తోంది. దీంతో వివిధ ప్రాంతాల్లోని భక్తులు ఆయా వివరాలను బట్టి గదులను బుక్‌ చేసుకుంటున్నారు. అయితే, ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను మార్చి 20à°¨ విడుదల చేసిన టీటీడీ అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు గదుల బుకింగ్‌ కోటా కూడా విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు à°ˆ కోటాను ప్రకటించలేదు. దీంతో ఇప్పటికే దర్శన టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు డైలమాలో పడ్డారు. ఇంతకీ గదుల కోటాను విడుదల చేస్తారా? లేదా అనే సందేహంతో భక్తులు సతమతమవుతున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లోని గదుల్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.