అతి తక్కువ ధరలో ఆధునిక వైద్య పరీక్షలు

Published: Sunday April 04, 2021

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌. కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల్లోని ముఖ్యమైన వ్యక్తులకు సుస్తీ చేస్తే తొలుత గుర్తొచ్చేది ఎయిమ్సే. అటువంటి ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌.. రాష్ట్ర విభజన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా విజయవాడ-గుంటూరుకు మధ్యలోని మంగళగిరిలో ఏర్పాటైంది. తొలుత ఔట్‌ పేషంట్‌ సేవలతో ప్రారంభించి.. ఇప్పుడు ఇన్‌పేషంటు సేవలు కూడా అందిస్తోంది. ప్రముఖ వైద్యులు, వైద్య విద్యార్థులు.. ఆధునిక వైద్య పరికరాలతో ఇక్కడ ఉన్నతమైన సేవలు అందిస్తున్నారు. పేదలకు కూడా అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలతో.. ఖరీదైన వైద్య సేవలు... వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎయిమ్స్‌.. వివిధ విభాగాల్లో వైద్యసేవలను విస్తరించుకుంటూ సగటున రోజుకు 500 మందికిపైగా రోగులకు సేవలు అందిస్తోంది. సోమవారమైతే à°ˆ సంఖ్య 750 దాటిపోతుంది. 

మంగళగిరి ఎయిమ్స్‌లో వైద్యసేవలు ప్రస్తుతానికి రెండు విధాలుగా అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రికి నేరుగా వచ్చి పది రూపాయల కన్సల్టేషన్‌ ఫీజుతో వైద్యులను కలిసి సేవలు పొందవచ్చు. ఉదయం ఎనిమిదిన్నర à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿à°—à°‚à°Ÿ వరకు ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకుని టోకెన్‌ తీసుకున్న రోగులు సాయంకాలం నాలుగు à°—à°‚à°Ÿà°² వరకు వైద్య సేవలను పొందవచ్చు. వారంలో ఒక్క శనివారం మాత్రం ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉదయం 12à°—à°‚à°Ÿà°² వరకే ఉంటుంది. ఆదివారం సెలవు. ఇక రెండో à°°à°•à°‚ సేవల à°•à°¿à°‚à°¦ టెలిమెడిసన్‌ విధానం అందుబాటులో ఉంది. à°ˆ విధానంలో రోగులు 85230 07940 లేదా 94930 65718 నంబర్లకు ఉదయం 8:30 నుంచి 11 à°—à°‚à°Ÿà°² మధ్య ఫోన్‌చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వీరికి ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి వైద్యులే ఫోన్‌చేసి వైద్య సలహాలు అందిస్తారు. ఇది పూర్తిగా ఉచితం. 

మంగళగిరి ఎయిమ్స్‌లో పలు రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీఎ్‌à°«à°Žà°‚ (కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌), ఈఎన్‌à°Ÿà±€, ఫిజికల్‌ మెడిసన్‌ అండ్‌ రీహబిటేషన్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్ధోపెడిక్స్‌, సైక్రియాట్రి, ఆఫ్తమాలజీ, డెర్మటాలజీ, పెడియాట్రిక్స్‌, ఓబీజీ, డెంటిస్ట్రీ వంటి విభాగాలలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నారు. రేడియాలజీ విభాగంలో అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనస్థీయాలజీ కూడా అందుబాటులో ఉంది. ప్రత్యేకించి హిమోఫిలియా వ్యాధిగ్రస్తుల కోసం ట్రాన్స్‌ప్యూషన్‌ మెడిసన్‌ను అందుబాటులోకి తెచ్చారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చే నెల నుంచి కొన్ని రకాల సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మంగళగిరి ఎయిమ్స్‌లో 50 పడకలతో ఇన్‌పేషెంట్‌ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రిలో ప్రధానమైన ఓపీడీ బ్లాకు వెనుకవైపు ఉన్న ఆయుష్‌ భవనాన్ని ఇన్‌పేషెంట్‌ వార్డుగా వినియోగిస్తున్నారు. ఇక్కడ అడ్మిషన్‌ చార్జీ రూ.25 కాగా, ఒక్కో పడకకు రోజుకు రూ.30 చార్జిగా నిర్ణయించారు. ఇవిగాక నర్సింగ్‌ చార్జీలు, ఇతర ఫీజులేమీ ఉండవు. వైద్య పరీక్షలు, మందులకు అతి తక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రోగులకు అవసరమైన మందుల కోసం అమృత్‌ ఫార్మసీ అందుబాటులో ఉంది.