స్టయిపెండ్‌ పెంచుతూ ఉత్తర్వులు

Published: Wednesday June 09, 2021

నెల రోజులుగా తమ డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం విఫలం కావడంతో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. à°—à°¤ నెల రోజులుగా జూనియర్‌ వైద్యులు ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు ప్రభుత్వానికి సమర్పిస్తూ వస్తున్నారు. వాటిలో సీనియర్‌ రెసిడెంట్ల స్టయిపెండ్‌ పెంపును మాత్రమే ప్రభుత్వం అమలు చేసింది. కొవిడ్‌ సమయంలో వైద్య సేవలు అందిస్తున్న జూనియర్‌ వైద్యులకు ఇన్సెంటివ్స్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు నష్ట పరిహారం, హెల్త్‌ఇన్సూరెన్స్‌, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులకు భద్రత, స్టయిపెండ్‌ నుంచి టీడీఎస్‌ కోత లేకుండా చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. à°ˆ సమస్యలన్నీ జూన్‌ 9 నాటికి పరిష్కరించాలని గతంలో ఆరోగ్యశాఖ అధికారులతో జరిగిన చర్చల్లో చెప్పారు. లేనిపక్షంలో సాధారణ వైద్య సేవలకు సంబంధించి విధులు బహిష్కరిస్తామని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. బుధవారంతో à°† గడువు పూర్తవుతుంది. దీంతో బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జూనియర్‌ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు ఆరోగ్యశాఖ ఆహ్వానించింది. ఆరోగ్యమంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు చర్చలు జరపనున్నారు. 

 

రాష్ట్రంలోని సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులకు వైద్యులకు, సూపర్‌ స్పెపాలిటీ వైద్యులకు స్టయిపెండ్‌ను ప్రభుత్వం పెంచింది. à°ˆ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెసిడెంట్‌ స్పెషలిస్ట్‌ డిగ్రీ వాళ్లకు నెలకు రూ.70 వేలు, రెసిడెంట్‌ డెంటి్‌స్టలకు రూ.65 వేలు, రెసిడెంట్‌ సూపర్‌ స్పెషలి్‌స్టలకు రూ.85 వేలను అందించనున్నారు. పెంచిన స్టయిపెండ్‌ గతేడాది సెప్టెంబరు నుంచి అమలవుతుంది.