పెరిగిన పన్ను బకాయి

వైఎస్ జగన్ ఇంటిపై ఉన్న ఆస్తిపన్ను బకాయి మరింత పెరిగింది. జూన్ నెలాఖరుకు మొదటి టర్మ్ ముగియడంతో 2019 తొలిదశ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలపై పెనాల్టీ పెంచుకుంటూ వచ్చారు. దీంతో రోజు తిరిగేలోపే కొత్తగా రూ.23,090 జరిమానా పడింది. తద్వారా జగన్ ఇళ్లు, ఆఫీసుపై ఉన్న మొత్తం ఆస్తిపన్ను బకాయి రూ.16,90,389కు చేరింది. తాజాగా సవరించిన మున్సిపల్శాఖ ఆస్తిపన్ను వెబ్సైట్ డేటా రిపోర్టులో ఈ అంశాన్ని పొందుపరిచారు. జగన్ సీఎం అయిన తర్వాతనుంచి తాడేపల్లిలోని ఆఫీసు, ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించడం లేదని, ఈ రెండింటి బకాయిలు రూ. 16,67,299 ఉందని ‘పన్నులు వేస్తాం...మేం కట్టం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ గురువారం వెలుగులోకి తీసుకొచ్చింది. జూన్ 30తో ఫస్ట్ టర్మ్ చెల్లింపు గడువు ముగిసింది. జూలై 1 నుంచి రెండోటర్మ్ మొదలైంది. దీనికి సంబంధించిన బకాయీ చెల్లించలేదు.

Share this on your social network: