టాటా కన్సల్టెన్సీ సర్వీసె్స సరికొత్త చరిత్ర

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసె్స (టీసీఎస్) సరికొత్త చరిత్ర సృష్టించింది. కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి కంపెనీ సిబ్బంది 5,09,058కి చేరుకున్నారు. దేశంలో అతిపెద్ద టెక్నాలజీ ఎంప్లాయర్ అయిన టీసీఎస్.. ప్రపంచంలో యాక్సెంచర్ తర్వాత రెండో స్థానంలో ఉంది. అమెరికన్ ఐటీ కంపెనీ యాక్సెంచర్లో 5.37 లక్షల మంది పనిచేస్తున్నారు. దేశంలోని ఇతర ఐటీ కంపెనీల విషయానికొస్తే, ఇన్ఫోసి్సలో దాదాపు 2.5 లక్షలు, విప్రోలో 1.9 లక్షలు, హెచ్సీఎల్ టెక్నాలజీ్సలో 1.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలనూ పరిగణనలోకి తీసుకుంటే.. పది లక్షల మందికి పైగా ఉద్యోగం కల్పిస్తోన్న రైల్వే శాఖ తర్వాత టీసీఎస్ రెండో అతిపెద్ద కంపెనీ. ఎల్ అండ్ టీలో 3.37 లక్షలు, రిలయన్స్ ఇండస్ట్రీ స్లో దాదాపు 2 లక్షలు, ఆదిత్య బిర్లా గ్రూప్లో 1.2 లక్షల మంది పనిచేస్తున్నారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నికరంగా 20,409 మందిని ఉద్యోగంలోకి చేర్చుకుంది. కంపెనీ త్రైమాసిక నికర నియామకాల్లో ఇప్పటివరకిదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ఆలోచనలో ఉంది. ప్రపంచంలోని 155 దేశాలకు చెందిన వారు తమ వద్ద పనిచేస్తున్నారని, మొత్తం సిబ్బందిలో మహిళల వాటా 36.2 శాతంగా ఉందని టీసీఎస్ తెలిపింది. కాగా జూన్తో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 8.6 శాతానికి తగ్గింది. దేశీయ ఐటీ రంగంలో కనిష్ఠ వలసల రేటు తమదేనని కంపెనీ అంటోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) టీసీఎస్ ఏకీకృత నికర లాభం రూ.9,008 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.7,008 కోట్ల లాభంతో పోలిస్తే 28.5 శాతం అధికమిది. ఈ క్యూ1లో టీసీఎస్ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 18.5 శాతం వృద్ధి చెంది రూ.45,411 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే సమయానికి ఆదాయం రూ.38,322 కోట్లుగా ఉంది. ఏప్రిల్-జూన్ కాలానికి కంపెనీ 810 కోట్ల డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. వార్షిక ప్రాతిపదికన ఈ విలువ 17.3 శాతం పెరిగింది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.7 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. వచ్చే నెల 5న చెల్లించనున్న డివిడెండ్కు లబ్ధిదారులైన వాటాదారుల రికార్డు తేదీని ఈ నెల 16గా నిర్ణయించారు.

Share this on your social network: