కోర్టు కోసమే ఈ-గజిట్‌ డ్రామా

Published: Sunday September 12, 2021

కోర్టు కళ్లకు గంతలు కట్టాలనుకున్న సర్కారు డ్రామా అధికారికంగా బయటపడింది. ఎవరో గిట్టని వారు కాదు.. తన చర్యలతో సర్కారే తన గుట్టు తానే రట్టు చేసుకోవడం గమనార్హం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) à°ˆ-గజిట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు à°† సమాచారాన్ని పొందవచ్చంటూ ఈనెల 7à°µ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌తో జీవో 100 జారీ చేయించారు. 72 గంటలు గడిచినా à°† జీవోని à°ˆ-గజిట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. గురువారం రాత్రి వరకు à°† జీవోని రహస్యంగానే ఉంచారు. అంతేనా...à°† జీవో ఆధారంగా ప్రజలకు తెలియాల్సిన రెగ్యులర్‌ ఉత్తర్వులను కూడా అందులో అప్‌లోడ్‌ చేయడం లేదని తేటతెల్లం అయింది. గురువారం మొత్తం మీద సర్కారు ఒకే ఒక్క గజిట్‌ నోటిఫికేషన్‌ 414ని అప్‌లోడ్‌ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ఈనెల 8à°¨ జారీ చేసిన జీవో 1468ని గజిట్‌à°—à°¾ నోటిఫై చేస్తూ ప్రకటించినదే అది.

 

ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారుల ఎంపిక సంవత్సరాన్ని, వారి క్వాలిఫై సర్వీసును ప్రకటిస్తూ కేంద్ర సర్కారు ఇచ్చిన ఆదేశాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. à°ˆ అంశంపై ఎలాగూ గజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే. కాబట్టి à°ˆ-గజిట్‌లో అప్‌లోడ్‌  చేశారు. ఇక ఇంతకుమించి ఒక్క జీవోను కూడా కొత్తగా పొందుపరచలేదు. వారాంతపు గజిట్‌లో హైకోర్టులో రిజిస్ట్రార్‌ పోస్టుల గజిట్‌ను అప్‌లోడ్‌చేశారు. ఇదీ గజిట్‌à°—à°¾ తప్పనిసరిగా ప్రకటించి అప్‌లోడ్‌ చేయాల్సిన అంశమే. కానీ, గురువారం జారీ చేసిన ముఖ్యమైన జీవోలను అందులో అప్‌లోడ్‌ చేయలేదు. à°ˆ చర్య ప్రభుత్వం జారీ చేసిన 100కు పూర్తి విరుద్దమైనదే. తాను ఇచ్చిన ఉత్తర్వులను సర్కారే ఉల్లంఘించడంతో తన డ్రామాను బయటపెట్టేసుకున్నట్లయింది. ఇది కాదా మోసం? ఇది కాదా మాయా? అని సమాచార హక్కు ప్రతినిధులు నిలదీస్తున్నారు.