NRI బ్యాంక్ అకౌంట్లోంచి రూ.14 లక్షలు మాయం.

Published: Monday November 08, 2021

 à°¤à°¨ బ్యాంకు అకౌంట్ వివరాలు చూసుకున్న à°“ ఎన్నారైకి ఊహించని షాక్ తగిలింది. తాను ఏటీఎంకు వెళ్లకపోయినా, ఎవరికీ చెక్కులూ గట్రా ఇవ్వకపోయినా.. ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయకపోయినా కూడా ఏకంగా 14 లక్షలు మటుమాయామయ్యాయని తెలిసి అతడికి ఏం చేయాలో పాలు పోలేదు. మూడు విడతల్లో à°ˆ మొత్తం విత్‌డ్రా అవగా.. చిట్టచివర్లో ఆయనకు విషయం తెలిసింది. దీంతో.. కంగారు పడిపోయిన ఆయన జరిగిన విషయాన్ని తన బంధువుకు చెప్పాడు. అసలేం జరిగిందో ఆరా తీయమని కోరాడు. à°ˆ క్రమంలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు à°† ఎన్నారైని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. లూథియానాకు చెందిన రామ్‌నీక్ తూర్ అనే ఎన్నారై ఎదుర్కొన్న పరిస్థితి ఇది. 

రామ్‌నీక్ తూర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బంధువు మహీందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు విడతల్లో చెక్కుల ద్వారా డబ్బులు డ్రా అయిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐదు నెలల పాటు దర్యాప్తు చేసి.. బ్యాంకు ఉద్యోగులే à°ˆ నేరానికి పాల్పడ్డట్టు తేల్చారు.  పవన్‌దీప్ కౌర్, అభిషేక్ వాలియా, à°…à°‚à°•à°¿à°¤, దీపక్ భట్‌లపై నేరపూరిత కుట్ర ఆరోపణల à°•à°¿à°‚à°¦ కేసు నమోదు చేశారు. కాగా.. తనకు అకౌంట్ ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులోనే నిందితులందరూ ఉద్యోగులన్న విషయాన్ని తెలుసుకుని బాధితుడు రామ్‌నీక్ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఏఎస్ఐ సుర్జిత్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. బ్యాంకు డిప్యుటీ మేనేజర్ అభిషేక్ వాలియా, కేషియర్ à°…à°‚à°•à°¿à°¤, క్లర్క్ దీపక్ భట్, పవన్‌దీప్ కౌర్ల కలిసి రామ్‌నీక్ తూర్ పేర కొత్త చెక్ బుక్‌ను జారీ చేయించుకున్నారు. ఆపై బాధితుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి చెక్కుల ద్వారా డబ్బును కాజేశారు. కాగా..పోలీసులు నిందితులపై సెక్షన్ 409, 120à°² à°•à°¿à°‚à°¦ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.