ఏపీలో నిర్మాణ రంగంపై మరో బాదుడు.
Published: Wednesday January 05, 2022
ఏపీలో నిర్మాణ రంగంపై మరో బాదుడు పడింది. సిమెంట్ ధరలు పెంపు చేస్తూ ఫ్యాక్టరీలు నిర్ణయం తీసుకున్నాయి. బస్తాపై రూ.20 నుంచి రూ.30 పెంచాయి. అన్ని బ్రాండ్ల సిమెంట్ బస్తాలపైనా ధరలు పెంచాయి. ఈ రోజు (బుధవారం) నుంచే ధరల బాదుడు అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు. సినిమా టికెట్ ధరలు తగ్గించిన ప్రభుత్వం.. సిమెంట్ ధరలను పెంచడమేంటని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Share this on your social network: