ఏపీలో కరోనా కల్లోలం

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో 27 వేలకు కరోనా యాక్టివ్ కేసులు చేరాయి. కరోనా బాధితుల్లో 1100 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 60 శాతానికి పైగా ఆక్సిజన్పై చికిత్స తీసుకుంటున్నారంటూ సీఎం జగన్ కొవిడ్ రివ్యూలో తెలిపారని చెబుతున్నారు. భారీ స్థాయిలో ఆక్సిజన్ బెడ్స్ వాడకంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగం పెంచింది. 9,525 మందికి కొవిడ్ పాజటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో 14.49 శాతంగా నమోదైంది. పండుగ నేపథ్యంలో షాపింగ్లు, ఇతర కార్యక్రమాలు కేసులు పెరగడానికి ఆజ్యం పోశాయి. ఈనెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. వాస్తవానికి రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ఈ నెల 11నే ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ.. సంక్రాంతి నేపథ్యంలో అమలును 18కి వాయిదావేసింది.

Share this on your social network: