రూ.27 వేల కోట్ల అప్పు

Published: Tuesday February 08, 2022

à°ˆ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి  మరో రూ.27 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతి కోరందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్  విజ్ఞప్తి చేశారని కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది. 2021- 22 సంవత్సరానికి గాను రూ. 27,325.78 కోట్ల అప్పులు బహిరంగ మార్కెట్లో చేసేందుకు రాజ్యాంగంలోని 293(3) నిబంధన à°•à°¿à°‚à°¦ అనుమతి ఇవ్వాలని..  డిసెంబర్ నెలలో జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో  కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్రాన్ని కోరామని ఆర్ధిక శాఖ తెలిపింది. బహిరంగ మార్కెట్లో అప్పులు చేసేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వున్న పరిమితిని రూ.42,472 కోట్లకు పెంచాలని జగన్ కోరారని ఆర్ధిక శాఖ పేర్కొన్నారు