రైతులకు ప్లాట్ల కేటాయింపు చేశారు

Published: Sunday September 02, 2018

తుళ్లూరు: à°®à°‚దడం, అనంతవరం రైతులకు తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో శనివారం ప్లాట్లను కేటాయించారు. సీఆర్డీయే ల్యాండ్సు డైరెక్టర్‌ చెన్నకేశవరావు కంప్యూటర్‌ ద్వారా లాటరీ తీసి à°ˆ ప్లాట్ల కేటాయింపు చేశారు. మందడం గ్రామానికి ఐదోవిడత లాటరీలో 24 మంది రైతులకు 43 ప్లాట్లలను కేటాయించారు. అందులో 27 నివాస ప్లాట్లు, 16 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. అనంతవరం గ్రామానికి నాలుగో విడత à°•à°¿à°‚à°¦ 11 మంది రైతులకు 30 ప్లాట్లను కేటాయింపు చేశారు. ఇందులో 21 నివాస ప్లాట్లు, 9 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్ల ధ్రువీకరణ పత్రాలను చెన్నకేశవరావు చేతుల మీదగా రైతులకు అందజేశారు. సాంకేతిక కారణాల చేత, మరికొన్ని ఇతర కారణాల చేత గతంలో ప్లాట్ల కేటాయింపు కాని రైతులకు మొదట లాటరీ ఏ విధంగా జరిగిందో అదే విధంగా ప్లాట్లు కేటాయింపు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీలు మాధురి, ఐటీ సిబ్బంది, సీఆర్డీయే ప్లానింగ్‌ అధికారి నాగే శ్వరావు పాల్గొన్నారు.