రూ. 80కి చేరుకున్న పెట్రోలు...

Published: Saturday September 08, 2018

దేశరాజధాని ఢిల్లీలో పెట్రో ధరలు మరింత భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలు ధర రూ. 80కి చేరుకుంది. శనివారం పెట్రో ధరల్లో మార్పులు చేసుకున్న నేపధ్యంలో లీటరుకు 39 పైసలు పెరిగి రూ. 80.38కి చేరుకుంది. అలాగే డీజిల్ 44 పైసలు పెరిగి రూ. 72.51కి చేరుకుంది. ముంబైలో 38 పైసలు పెరిగి రూ. 87.77 కు చేరుకుంది. అలాగే డీజిల్ 47 పైసలు పెరిగి రూ. 76.98కి చేరుకుంది. చెన్నైలో పెట్రోలు రూ. 83.54, డీజిల్ 76.64కు చేరుకుంది.