ప్రణయ్‌ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే.

Published: Tuesday September 18, 2018

ఏలూరు: à°•à±à°² నిర్మూలన వివాహం చేసుకున్న పెరుమాళ్ళ ప్రణయ్‌ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా భావించాల్సి వస్తుందని ఆలిండియా అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెండెం సంతోష్‌కుమార్‌ అన్నారు. పాతబస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రణయ్‌ హత్యను ఖండిస్తూ దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. à°ˆ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మనుషు లంతా సమానమేనని రాజ్యాంగం తెలియజేస్తుందన్నారు. మానవత్వం మరిచి పశువులుగా నరికి చంపడం హేయమైన చర్య అన్నారు. ప్రణయ్‌ను హత్యచేసిన వ్యక్తులను తక్షణమే పట్టుకుని జనాల మధ్యలోనే ఉరి తీయాలన్నారు.