విమాన సిబ్బంది పొరపాటు...

Published: Thursday September 20, 2018
 à°œà±†à°Ÿà±‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా 30 మంది విమాన ప్రయాణికులు అనారోగ్యం పాలయ్యారు. à°ˆ రోజు ఉదయం ముంబయి నుంచి జయపుర వెళ్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలోని సిబ్బంది క్యాబిన్‌లో ఒత్తిడిని తగ్గించే స్విచ్‌ను ఆన్‌‌చేయడం మరిచిపోయారు. దీంతో విమానంలో తీవ్ర ఒత్తిడి ఏర్పడి 30 మంది ప్రయాణికులకు ముక్కు, చెవుల నుంచి రక్తం కారింది. మరికొందరు తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. à°ˆ పొరపాటును గ్రహించిన సిబ్బంది విమానాన్ని తిరిగి ముంబయిలో ల్యాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న ముంబయి విమానాశ్రయ సిబ్బంది అక్కడికక్కడే బాధితులకు చికిత్స అందజేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. à°ˆ ఘటన సమయంలో విమానంలో 166 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వెలిబుచ్చింది. ఆ విమానంలో విధుల్లో ఉన్న సిబ్బందిని తప్పించడంతో పాటు ఈ ఘటనపై ఏఏఐబీతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది.