అరకు ఎమ్మెల్యేపై మావోయిస్టులు కాల్పులు

Published: Sunday September 23, 2018

అరకులోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో à°˜à°Ÿà°¨à°¾à°¸à±à°¥à°²à°‚లోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద à°ˆ దారుణం చోటుచేసుకుంది.  à°¦à°¾à°¡à°¿à°²à±‹ à°•à°¿à°¡à°¾à°°à°¿ అనుచరులు మరికొంతమందికి  కూడా గాయాలైనట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి అనంతరం పార్టీ మారి.. టీడీపీలో చేరారు.

కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ నిర్ధారించారు. మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. à°ˆ దాడిలో దాదాపు 50మంది మహిళ à°®à°¾à°µà±‹à°¯à°¿à°¸à±à°Ÿà±à°²à± పాల్గొన్నట్టు సమాచారం. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు.