చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Published: Monday September 24, 2018

న్యూయార్క్: à°…రకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐల సభలో మాట్లాడిన చంద్రబాబు ప్రజాస్వామ్యంలో హత్యలకు తావులేదన్నారు. కిడారి, సివేరి సోమ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం తెలిపారు. ప్రాణం పోయలేనివారికి ప్రాణం తీసే హక్కు లేదన్నారు. ‘నిర్మాణమే మన బాధ్యత..విధ్వంసం నైజం కారాద’ని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలను అందరు ఖండించాలని సీఎం చంద్రబాబు అన్నారు.