ఇంట్లోకి దూసుకెళ్లిన 278 చక్రాల భారీ కంటైనర్‌

Published: Friday September 28, 2018

విజయవాడ: à°Ž.కొండూరు మండలంలోని రామచంద్రాపురం మలుపు వద్ద జాతీయ రహదారిపై 278 చక్రాల భారీ కంటైనర్‌ లారీ గురువారం ఇంట్లోకి దూసుకెళ్లింది. à°ˆ కంటైనర్‌లో à°’à°• యంత్రాన్ని ఎన్టీపీఎస్‌ విద్యుత్‌ థర్మల్‌ కేంద్రానికి తీసుకువెళుతుండగా à°ˆ సంఘటన జరిగింది. à°ˆ వాహనం నిలిచిపోవడం వల్ల విజయవాడ-భద్రాచలం రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు తిరువూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రెడ్డిగూడెం వైపు, మైలవరం నుంచి వచ్చే వాహనాలను రెడ్డిగూడెం వైపు మళ్లించారు. రామచంద్రాపురం మలుపు వద్ద à°ˆ వాహనాన్ని తిప్పేందుకు ముందుగా ప్రణాళిక వేసి మలుపులో ఉన్న పాలసేకరణ కేంద్రం ప్రహరీని, సమీపంలోని వెంకటేశ్వరరెడ్డి ఇంటి ప్రహరీని తొలగించి విద్యుత్‌ లైన్లు కూడా తప్పించారు. అయినా అదుపు తప్పి పక్కనే à°—à°² గృహంలోకి దూసుకెళ్లి వాహనం నిలిచిపోయింది. బాధితులకు పరిహారం చెల్లించి వాహనాన్ని తరలించేందుకు ఎన్టీపీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.