నిన్న అదృశ్యం...నేడు పొదల్లో చిన్నారి

Published: Tuesday October 09, 2018

దువ్వాడ: à°µà°¿à°¶à°¾à°–లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారి అలైఖ్య అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. పాప కనిపించడం లేదంటూ నిన్న సాయంత్రం దువ్వాడ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాప ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగానే ఇంటికి దగ్గరలోని పొదల్లో పాప శవమై కనిపించింది. చిన్నారి ముఖంపై గాయాలు కనిపించడంతో ఎవరో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.