వీళ్లతో జాగ్రత్త..!

Published: Saturday October 13, 2018
విజయవాడ: à°…మ్మదర్శనం వద్ద కూడా హిజ్రాలు పట్టి పీడించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నోట్లు ఇవ్వనిదే కదలనివ్వమంటూ పట్టుబట్టి దారికాయడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. కదిలే రైళ్లలో వీరి ఆగడాలకు విసుగెత్తిన వివిధ వర్గాల ప్రజలు ఆఖరుకు ఇక్కడ కూడా వారి దూకుడుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి బయటపడటానికి యువకులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. రథం సెంటర్‌లో పలువురు హిజ్రాలు శుక్రవారం ఒక్కసారిగా హల్‌చల్‌ సృష్టించారు.
 
దర్శనానికి వెళ్లి వచ్చిన భక్తుల నుంచి ఐదారు మంది హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. డబ్బుల్లేవని పర్సులు చూపించినా మహిళలను సైతం వదల్లేదు. యువకులను కూడా ముందుకు కదలనీయకుండా అడ్డుకుని మరీ డబ్బు గుంజారు. తల మీద చేతులు వేయడం... చేతులు పట్టుకుని వెనక్కి లాగడం... భుజాలపై తాకడం... వంటి వీరి చేష్టలతో విసిగిపోయిన భక్తులు డబ్బులు సమర్పించుకుని బయటపడ్డారు. వీరి చేష్టలపై పోలీసులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.