ఆంధ్ర ఆటోలను అడ్డుకుంటున్న కర్ణాటక పోలీసులు

Published: Saturday October 20, 2018
కర్ణాటకలోని బాగేపల్లికి ఆంధ్రకు సంబంధించిన ఆటోలు ఏ ఒక్కటి రాకూడదని బాగేపల్లి పోలీసులు హుకుం జారీచేశారని చిలమత్తూరు మండలంలోని à°† టోల యజమానులు వాపోతున్నారు. చిలమత్తూరు, కొడికొండ చెక్‌పోస్టు, కోడూరు, సోమఘట్ట, కొడికొండ ప్రాంతాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో బాగేపల్లికి ఆటోలు వెళ్తా యి. అయితే à°“ పోలీస్‌ అధికారి బదిలీపై బాగేపల్లికి వచ్చాడు. ఆయన వచ్చినప్పటి నుంచి బాగేపల్లికి ఆంధ్ర ఆటోలు రాకూడదంటూ పేర్కొన్నారు. దీంతో వారం క్రితం చిలమత్తూరు మండలానికి చెందిన రెండు ఆటోలు స్వాధీనం చేసుకుని బాగేపల్లిలో ఉంచుకున్నట్లు బాధితులు వాపోతున్నారు.
 
 
ముఖ్యంగా.. à°šà°¿à°²à°®à°¤à±à°¤à±‚రుకు దగ్గరగా బాగేపల్లి ఉండటంతో రోగులు బాగేపల్లి ఆసుపత్రికి అధికంగా వెళ్తుంటారు. à°ˆ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆటోల్లో ఇద్దరు గర్బిణీలు బాగేపల్లికి వెళ్లగా పట్టణంలోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో గర్బిణీకి చెందిన కుటుంబీకులు పోలీసులతో వాదనకు దిగారు. దీంతో ఇక్కడి పోలీసులు కర్నాటక పోలీసులను సంప్రదించి రోగులతో వచ్చే వాహనాలను అడ్డగించవద్దని కోరారు. అయితే మరలా కూడా ఆంధ్ర ఆటోలను అడ్డగిస్తే చిలమత్తూరు మండలంలోకి కర్నాటక ఆటోలు రానీయకుండా అడ్డుకుంటామని ఇక్కడి ఆటో యజమానులు పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని చిలమత్తూరు మండలంలోని ఆటో యజమానులు కోరుతున్నారు.