కాంగ్రెస్‌లోకి ప్రముఖ సినీనటుడు..?

Published: Monday October 29, 2018

సినీ నటుడు ప్రభు జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తు న్నాయి. మహానటుడు దివంగత శివాజీ గణేశన్‌ చిన్న కుమారుడు ప్రభు. ఈయన సినీ హీరోగా à°“ వెలుగు వెలిగారు. అయితే, తన తండ్రిలా సుధీర్ఘకాలం సినిమాల్లో కొనసాగలేకపోయారు. à°ˆ నేపథ్యంలో ఆయనలో రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన వచ్చింది. ఇటీవల నగరంలో జరిగిన à°’à°• కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని తన మనసులోని మాటను వెల్లడించారు కూడా. రాజకీయాల్లోకి పక్కా ప్రణాళికతో ప్రవేశిస్తానని తెలిపారు. ఇదిలావుంటే, శివాజీ గణేశన్‌ జీవించి వుండగా దివంగత కామరాజర్‌తో కలిసి పనిచేశారు. దీంతో శివాజీ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీతో మంచి అనుబంధం ఉంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ప్రభు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. à°ˆ దఫా నగరానికి వచ్చే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దివంగత శివాజీ గణేశన్‌ ఇంటికి వెళ్ళి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని, à°† సమయంలో ప్రభు కాంగ్రెస్‌ పార్టీలో చేరవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల కంటే ముందుగానే ప్రభు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్‌కు చెందిన సినీ నటి ఖుష్బూ తొలుత డీఎంకేలో చేరారు. à°† తర్వాత à°† పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. దీంతో ప్రభు కూడా à°ˆ పార్టీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న సమయంలో ప్రభు - ఖుష్బూల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే.