బస్సును ఢీకొన్న లారీ.. ఇరుక్కున్న కారు

Published: Thursday November 01, 2018

రాయచోటి: à°•à°¡à°ª జిల్లా రాయచోటి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. à°ˆ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ఉన్న ప్రయాణికుల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడి అటుగా వస్తున్న ఇండికా కారును ఢీకొట్టింది. దీంతో బస్సు, హైవేపై ఉన్న రెయిలింగ్ మధ్యలో కారు ఇరుక్కుపోయింది. కాగా కారుపై బస్సు పడకపోవడంతో అందులో ఉన్న ఐదుగురికి ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే à°ˆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు రాయచోటి నుంచి కడపకు వస్తుండగా ప్రమాదం జరిగింది.