విశాఖలో ధోనీ క్రికెట్ అకాడమీకి ఒప్పందం కుదిరింది ...

Published: Saturday November 17, 2018
విశాఖపట్టణం: à°Ÿà±€à°®à°¿à°‚డియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాను ఎంతగానో అభిమానించే విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు. ఇందులో భాగంగా ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ à°Žà°‚à°¡à±€ మిహిర్ దివాకర్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను నిర్మించనున్నారు. యువ క్రీడాకారులు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
 
విశాఖపట్టణం అంటే ధోనీకి ప్రత్యేక అభిమానం. 5 ఏప్రిల్ 2005లో పాకిస్థాన్‌తో రెండో వన్డే ఆడేందుకు విశాఖలో అడుగుపెట్టిన ధోనీ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 148 పరుగులు చేశాడు. à°ˆ మ్యాచ్ తర్వాత ధోనీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తనకు అచ్చొచ్చిన విశాఖ అంటే అప్పటి నుంచి ధోనీకి వల్లమాలిన అభిమానం. విశాఖ ఎంతో అందమైన నగరమని, అక్కడ ఉండడమంటే తనకెంతో ఇష్టమని à°“ సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు ఏకంగా అకాడమీనే ఏర్పాటు చేసి నగరంతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకోబోతున్నాడు.