చంద్రబాబుకు మతిభ్రమించింది.

Published: Sunday November 18, 2018

‘‘చంద్రబాబుకు మతిభ్రమించింది. ఆయన మానసిక పరిస్థితి కూడా బాలేదు. ఆయన సీఎం పదవికి ఏ మాత్రం అర్హుడు కాడు. వచ్చే ఎన్నికల తరువాత ఏర్పడబోయేది జగన్‌ ప్రభుత్వమే’’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ‘‘నాలుగున్నరేళ్ళ టీడీపీ పాలనలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు’’ అని విమర్శించారు.