రాజకీయాలు ఎవరివో 11న తేలతాయి

Published: Saturday February 09, 2019

 ‘ఢిల్లీ వేదికగా ఈనెల 11à°¨ నిర్వహించే ధర్మపోరాటాన్ని విజయవంతం చేయాలి. ప్రజలు, ప్రజా సంఘాలంతా రాష్ట్రం వైపు ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు ఉన్నాయి. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారు. ఎవరు రాష్ట్రం కోసమో, ఎవరు రాజకీయాల కోసమో ఢిల్లీలో జరిగే ఆందోళనే తేలుస్తుంది. à°ˆ కార్యక్రమానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాం. ఒకవేళ వాళ్లు రాకపోతే ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, ఇన్‌ చార్జులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ à°…à°–à°‚à°¡ విజయమే ఏపీ భవిష్యత్‌ అని, అన్ని వర్గాల మద్దతు పొందాలని సూచించారు. కాగా, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో జరగనున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి విశాఖ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ వెళ్లే వారికోసం శ్రీకాకుళం నుంచి 17బోగీలతో వేసిన ప్రత్యేక రైల్లో 2బోగీలు విశాఖ నాయకులకు కేటాయించారు.