నన్ను దొంగ దెబ్బతీయాలని చూస్తున్నారు

Published: Thursday February 14, 2019

అమరావతి: à°¤à°¨à°¨à± దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా పలు విషయాలపై చర్చకు వచ్చాయి. ఎన్నికలకు ముందే బీజేపీయేతర పక్షాల కూటమి ఉంటుందన్నారు. "నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నా. 5 కోట్ల ప్రజల హక్కుల కోసం ధర్మపోరాటం. బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయి. అవకాశవాదులకు టీడీపీలో స్థానంలేదు. కొందరు పోతే నష్టాలకన్నా లాభాలే మిన్న. నాపై కులముద్ర వేయాలని చూడటం దారుణం. వైసీపీ కులాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. à°“ వైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం..మరోవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ మీరిచ్చిన ప్రోత్సాహంతోనే à°ˆ నిరంతర శ్రమ. ఢిల్లీలో కేజ్రీవాల్ దీక్షకు గొప్ప స్పందన వచ్చింది. మోదీ పాలనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. అన్నదాత సుఖీభవ పథకం à°’à°• చరిత్ర. కేంద్రం ఇచ్చిన సాయంలో అనేక ఆంక్షలు విధించింది. ఏపీలో మాత్రం రైతులందరికీ ఇస్తున్నాంఅని à°ˆ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు