సరిహద్దు గ్రామాల్లో విద్యుత్ దీపాలు వెలిగించొద్దు

Published: Monday March 04, 2019
పాక్ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలపై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. పాక్ సరిహద్దునకు 20 కిలోమీటర్ల దూరంలో బాణస్కంత జిల్లాలోని జలోయ, మావసారి, శివనగర్ గ్రామాల్లో రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలిగించవద్దని బీఎస్ఎఫ్ గ్రామీణ ప్రజలకు ఆదేశించింది.
 
మేఘపురా, రండోసాన్ గ్రామాల్లోనూ రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలిగించవద్దని ఆదేశించిన బీఎస్ఎఫ్ గ్రామాల గోడలపై హెల్ప్ లైన్ నంబర్లను పెయింట్ చేసింది. బీఎస్ఎఫ్ ఆదేశం మేర తాము రాత్రివేళ గ్రామంలో విద్యుత్ దీపాలు స్వీచాఫ్ చేశామని రండోసాన్ గ్రామ సర్పంచ్ దిలీప్ సిన్హా చౌహాన్ చెప్పారు. పాక్ సరిహద్దుల్లోని ఈవల్ గ్రామంలోనూ విద్యుత్ దీపాలు స్వీచాఫ్ చేశామని స్థానిక సర్పంచ్ బాబుఅల్ చెప్పారు. రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలిగిస్తే తమను సులభంగా గుర్తించి పాక్ సైనికులు దాడికి తెగబడే ప్రమాదముందని సర్పంచ్ చౌహాన్ చెప్పారు. సరిహద్దు గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే బీఎస్ఎఫ్ కు సమాచారం అందించాలని కమాండెంట్ గ్రామస్థులను కోరారు. పాక్ సరిహద్దు కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే తమ మేఘపూర్ గ్రామం నుంచి 20కిలోమీటర్ల దూరం ఉన్నా అటవీ మార్గం గుండా వెళితే కేవలం సరిహద్దు కిలోమీటరు దూరంలోనే ఉందని సర్పంచ్ చౌహాన్ పేర్కొన్నారు. మొత్తంమీద ఇండో-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతతో సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.