ప్రిపరేషన్‌, పరీక్షల సమయంలోనే ప్రచార హోరు

Published: Tuesday March 12, 2019
సార్వత్రిక ఎన్నికల నగారాతో రాజకీయ పార్టీల సందడి ఎలా ఉన్నా.. పాఠశాల విద్యార్థుల్లో మాత్రం కలవరం మొదలైంది. రాష్ట్రంలో తొలివిడతలోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో à°ˆ పరిస్థితి ఎదురైంది. పోలింగ్‌ ఏప్రిల్‌ 11à°¨ జరగనున్నప్పటికీ, à°ˆ నెల 18నే నోటిఫికేషన్‌ రానుండటంతో అప్పటి నుంచి గ్రామ, పట్టణ, నగర ప్రాంతాలన్నింటా రాజకీయ కోలాహలం మొదలవుతుంది. సరిగ్గా à°ˆ సమయంలోనే అంటే మార్చి 18 నుంచి రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. à°ˆ పరీక్షలు ఏప్రిల్‌ 3 వరకు ఉంటాయి.. ఇప్పటికే టెన్త్‌ విద్యార్థులపై ఫస్ట్‌క్లాస్‌, 10 జీపీఏ ఒత్తిడి ఉంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు à°ˆ దిశగానే పిల్లలను సమాయత్తం చేస్తున్న పరిస్థితి.
 
 
పరీక్షల సమయాల్లో రాజకీయ పార్టీల ప్రచార హోరు, సభల కారణంగా విద్యార్థి లోకానికి చదువుల పరంగా కొంత ఇబ్బందులు తప్పవన్న ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి. ఇటు à°’à°•à°Ÿà°¿ నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 8 నుంచి 22à°µ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించేలా విద్యా విషయక క్యాలెండర్‌లోనే షెడ్యూల్‌ ప్రకటించారు. పోలింగ్‌ ఏప్రిల్‌ 11à°¨ జరగనున్నందున ఇప్పుడు à°† పరీక్ష à°² తేదీలను రీషెడ్యూల్‌ చేయాల్సిన పరిస్థితి తప్పనిసరి కానుంది. మరోవైపు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ à°°à°‚à°— యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 1.86 లక్షల మంది ఉపాధ్యాయులుండగా, వారిలో కొంతమందికి ఎన్నికల నిర్వహణ విధులు అప్పగిస్తారు. ఫలితంగా ఆయా టీచర్లు పలుమార్లు ఎన్నికలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉంటుంది.