అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యేగా మరో కొత్త అభ్యర్థిని

Published: Tuesday March 19, 2019

అనంతపురం జిల్లాలో మరో కొత్త అభ్యర్థిని టీడీపీ తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే పరిటాల శ్రీరామ్, జేసీ పవన్, జేసీ అశ్మిత్ రెడ్డి.. వంటి యువ నేతలు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వారితోపాటు బండారు శ్రావణి అనే యువ నాయకురాలు కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీ జేసీ అండదండలతో ఆమెకు శింగనమల టికెట్‌ను చంద్రబాబు ఖరారు చేశారు. మొదటి విడతలోనే మెజారిటీ సీట్లకు టికెట్లను కేటాయించిన చంద్రబాబు.. కొన్ని స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. వాటిల్లో ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన శింగనమల నియోజకవర్గం కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలపై కొంత వ్యతిరేకత ఉంది. à°† నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఆమెకు అనుకూలంగా రాలేదు. ఆమెకు టికెట్ ప్రత్యామ్నాయం చూపిస్తూనే బలమైన అభ్యర్థి కోసం చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారు. ఇదే అదనుగా భావించిన జేసీ.. శింగనమల సీటును బండారు శ్రావణికి కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తడి తెచ్చారు. దీంతో మరోసారి ఆమె పేరుతో శింగనమలలో చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. సర్వే ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాత.. తుది నిర్ణయాన్ని సోమవారం ప్రకటించారు. ఎంపీ జేసీ అభిప్రాయానికి చంద్రబాబు ఓకే చెప్పారు. బండారు శ్రావణికి శింగనమల టికెట్‌ను ఖరారు చేశారు.