వాపోతున్న వైసీపీ శ్రేణులు

Published: Wednesday April 03, 2019
ఎన్నికల ప్రచారం ఆఖరు దశకు చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేనాని పవన్‌కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం పలుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ వీలైనంత తరుచుగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ వెళ్తుండడం ఒక్కేసాని రోజంతా అక్కడే ఉండిపోవడం చర్చనీయాశమైంది. ఇటీవల జగన్ ఎన్నికల ప్రచారానికి రాకుండా లోటస్ పాండ్‌‌లోనే ఉన్నారు. à°… మర్నాడే రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. మళ్లీ మంగళవారం ఎన్నికల ప్రచారానికి రాకుండా రోజంతా లోటస్ పాండ్‌లోనే ఉండిపోయారు. ఈసారి ఎలాంటి స్కెచ్‌ వేశారో.. ఏమవుతుందోనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే వైసీపీ నేతలు కూడా జగన్ వైఖరిని తప్పుబడుతున్నారు.
 
ఇలాంటి కీలక సమయంలో జగన్ అందుబాటులో లేకుండా లోటస్ పాండ్‌‌కు వెళ్లిపోతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన సినీతారల కోసం హైదరాబాద్‌లో ఉంటూ.. వారికి పార్టీ కండువాలు వేస్తూ దర్శనమిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు వాపోతున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రచారాన్ని ఆపీ మరీ లోటస్ పాండ్ వేదికగా వలసలను ప్రొత్సహిస్తున్నారు. నాటకీయ పరిణామాలతో నటుడు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. అంతకుముందు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని రోడ్డెక్కిన ఆయన తెల్లవారే వైసీపీలో చేరారు. మోహన్‌బాబుతో ఆయన కుమారుడు విష్ణు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరిన వెంటనే చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. వైసీపీలో చేరాలని జగన్‌ మూడేళ్ల కిందటే అడిగారని, ఏపీకి జగన్‌ సీఎం అయితే బాగుంటుందని మోహన్‌బాబు అభిప్రాయపడ్డారు.
 
లోటస్ పాండ్ వేదికగానే నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు వైసీపీలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. సూపర్ డూపర్ అనేలా పాలన అందిస్తారని రాజశేఖర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తారని తెలిపారు. గతంలో జగన్‌తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. అయితే తాము గతంలో చూసిన జగన్ వేరు.. ఇప్పుడున్న జగన్ వేరని చెప్పారు. గతంలో వైసీపీలో ఉన్న à°ˆ దంపతులు.. జగన్‌తో విభేదాలు కారణంగా.. బీజేపీలో చేరారనే ప్రచారం జరిగింది. à°† తర్వాత à°† పార్టీకి రాజీనామా చేశారు. గతేడాది చంద్రబాబుకు మద్దతు పలుకుతూ టీడీపీలో చేరారు. ఇప్పడు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.